ఈ విజయం పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం.. సూర్యకుమార్ పోస్ట్
ఆసియా కప్లో టీమిండియా పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. 47 పరుగులతో నాటౌట్గా నిలిచి భారత్కు చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ X వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. పాకిస్థాన్పై ఈ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక మ్యాచ్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా.. సూర్యకుమార్, శివమ్ దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లారు