పేదరికం “కౌగిట్లో” ప్రపంచ బాలలు
(నవంబర్ 14 బాలల దినోత్సవం భారత మాజీప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా)
“నేటి బాలలే రేపటి పౌరులు”
బాలలు జాతీయ సంపద
భవిష్యత్తుమానవ వనరులు.వారి శ్రేయస్సు దేశాభివృద్ధికి మూలం అందుకే “నేటి బాలలే రేపటి పౌరులు “అన్నారు పెద్దలు .బాలల సంక్షేమం అభివృద్ధి పైపెట్టుబడి దేశాభివృద్ధికి సూచిక. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మ హక్కు .సమాజంలో మంచి పౌరులుగా ఎధుగాలంటె బాల్యదశ కీలకమైంది.పిల్లల మనసులు చాలా సున్నితమైనవి
బాల్యదశలో వారు ఎదురుకున్న ఇబ్బందులు కష్టాలువారి భవిష్యత్తు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మానసిక శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో పేర్కోన్నారు .ఇంటిలో బడిలో అహల్లాధకరమైన వాతావరణంలో పిల్లలు పెరగడానికి
కావలసిన పరిస్థితులు కలిపించి వనరులు సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద సమాజం మీద వుంటుంది.
బాలలు _ కరోనా ప్రభావం
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ,ప్రపంచ ఆర్థిక ‘వ్యవస్థ విద్యా వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురైంది.మూతబడిన స్కూల్స్ ఊడిన ఉద్యోగాలు’ స్తంభించిన ప్రజాజీవనం’ మూతబడిన పరిశ్రమలు ‘పెరిగిన నిరుద్యోగం’ తగ్గిన ఆదాయం పిల్లల జీవితాలను ప్రభావితం చేసింది.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బాలలు మధ్య తరగతి పేద వర్గాలకు చెందిన బాలలు కనీస సౌకర్యాలు లేక ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని
కటిన దారిద్య్రం లోకి నెట్టివేయ బడ్డారనీ ఇటీవల “యూనిసెఫ్” నివేదిక పేర్కొంది.
యూనిసెఫ్ నివేదిక _ బాలల స్థితి
“యూనిసెఫ్ “అధ్యయనం ప్రకారం కోవిడ్ కారణాన అభివృధి చెందిన అభివృధి చెందుతున్న దేశాల్లో బాలలకు కావలసిన విద్యా ‘వైద్య ఆరోగ్య’ గృహ వసతి ‘పోషకాహారం పారిశుద్ధ్యం’ తాగు నీరు అందుబాటులో లేని బాలల సంఖ్య 125 కోట్లు వుండగ వీరికి అధనంగ మరో15 కోట్ల మంది చేరారని ఈ పరిస్థితులు పేదరికం పెరగడానికి దారితీసింది. “ప్రపంచ బాంక్ యూనిసెఫ్ “నివేదిక ప్రకారం భారత దేశంలో 30 శాతం పైగా కఠిన పేదరికంలో బాలలు వున్నారని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గణనీయమైన అభివృధి వల్ల పేదరికం తగ్గినప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న కుటుంబాలలో బాలలు పేదరికాన్ని అనుభవిస్తుండం శోచనీయం. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచ దేశాలలో 1981 సం””లో వున్న పేదలు 2010సం” నాటికి పేదలుగానే వున్నారని తేలింది. పేదరికములో జీవిస్తున్న బాలల సంఖ్య మారలేదని “ప్రపంచ బ్యాంకు అధ్యక్షులు జిమ్ యాంగ్ కింగ్” అన్నారు. పేదరికం నిరుద్యోగం బాలకార్మికల సంఖ్యపెరగడానికి దోహదపడిందని ప్రపంచ బ్యాంకు “ఆర్థిక.వేత్త కౌశిక్ బసు “పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే 30 శాతం పైగా అత్యంత పేదరికంలో నివసించే బాలలు భారత దేశములో ఉండడం గమనార్హం.
“ఎండింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫోకస్ ఆన్ చిల్డ్రన్ “నివేదిక ప్రకారం పేదరికంలో నివసించే పెద్దల కంటే బాలలు రెండు రెట్లు ఎక్కువ వుండే అవకాశం ఉందని తేలింది. జనాభాలో 3.వ వంతు ఉన్న బాలల్లో అందులో సగం మంది పేదరికంలో వున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
2013 నాటికి అభివృధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం1.90 డాలర్లు సంపాదిస్తున్న కుటుంబాలలో19.5 శాతం బాలలు పేదరికంలో వున్నట్లు తేలింది.7 దశబ్దాల స్వాతంత్ర భారత్ సాధించిన అభివృధి పథకాల ఫలితాలు
భారత దేశములో గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీ ‘ఎస్టీ ‘పేద బడుగు బలహీన వర్గాలకు అందక పోవటం వల్ల ఈ వర్గాల్లో 80.శాతం బాలలు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అభివృధి చెందిన దేశాలలో 5 యేళ్ల లోపు బాలల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు అత్యంత పేదరిక కుటుంబాలలో నివసిస్తున్నారు.
కరోనా మహమ్మారి
పేద ‘మధ్య ‘అల్ప ‘ఆదాయ దేశాల మీద ఎక్కువ ప్రభావం చూయించింది. ప్రపంచ దేశాలతో పాటు బాలల జనాభా ఎక్కువ ఉన్న దేశాలలో వర్ధమాన దేశాలు భారత దేశం బాలల అభివృధి సంక్షేమ పట్ల ప్రతేక శ్రద్ధ పెట్టాలి.
కరోనా _ బాలల భద్రత.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విసిరిన పంజాకు సామాజిక’ ఆర్థిక’ విద్య ‘వైద్య రంగాలు కుదేలైనాయి. పరిశ్రమలు మూతపడ్డాయి ఉద్యోగం లేక అనేక కుటుంబాల ఆదాయాలు తగ్గాయి.ఈ ప్రభావం బాలల మీద పడింది. విద్య’ వైద్య ‘ఆరోగ్య సౌకర్యాలు ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని స్థితిలో బాలలు కూరుకు పోవటంవల్ల వారి శారీరక మానసిక వికాసం కుంటుపడింది.
కొరనా వల్ల బాలల్లో లింగపరమైన
అసమానతలు :విద్యా పరమైన అంతరాలు పెరిగాయి.బాలల జీవనం పై కరోనా మహమ్మారి ప్రభావంపై ఇటీవల” సేవ్ ది చిల్డ్రన్”అనే సంస్థ ప్రతేక అధ్యయనాలు చేసింది
కోరనా వల్ల 93 శాతం కుటుంభాలు సగానికి పైగాఆదాయం కోల్పోవడంతో ఆరోగ్య సేవలు పొందలేదని 62 శాతం కుటుంబాలు బాలలకు పౌష్టికాహారం అందించలేక పోయాయని.37.శాతం పేద కుటుంబాల బాలలు చదువు కోవడానికి అభ్యసన పరికరాలను కొనలేక పోయారని సర్వేలో తేలింది.
కరోనా “లాకడౌన్ ‘వల్ల స్కూల్స్ మూతబడ్డాయి. ఆన్లైన్ భోధన వల్ల
టీచర్స్ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రతి 10 మంది లో ,8 మంది బాలలు ఏమి నేర్చుకోలేదని గృహ హింస పెరిగిందని ‘బాలికల పై ఇంటి పని పిల్లల సంరక్షణ భారం ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతిని ప్రతికూల భావనలు పెరిగాయని సర్వే పేర్కొంది. విద్యా రంగములో అత్యవసర పరిస్థితిని పాటించడం వల్ల ఈ సంవత్సరం దాదాపు కోటి మంది పిల్లలు స్కూల్స్ కు తిరిగి రాక పోవచ్చును అన్న అంచనాలు విద్యావేత్తల్లో
తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం భారత దేశములో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల1.2 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన చేరే అవకాశం వుందనీ పేర్కోవడం బాలల భద్రత కు పెను సవాలు గా పరిణమించింది
ప్రభుత్వాలు _ బాలల అభివృధి
బాలల సర్వతోముఖ అభివృధికొరకు ప్రభుత్వాలు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చెయ్యాలి.బాలల కనీస అవసరాలు తీర్చి వారి వికాసానికి కృషి చేయడం ప్రభుత్వాల బాధ్యత ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల రక్షణ కోసం 1989 నాటి అంతర్జాతీయ ఒడంబికను ప్రపంచ దేశాలు క్షేతరస్థాయిలో పటిష్టంగా అమలు చెయ్యాలి
స్త్రీ శిశు సంక్షేమానికి ప్రాధాన్యత కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ మతా శిశు సంక్షేమ పథకాలు ‘ఇమ్మునైజెషన్ పరిశుభ్రమైన నీరు పౌష్ఠికాహార పంపిణీ ‘ప్రాథమిక.వసతులు ఏర్పాటు చెయ్యాలి.
ప్రభుత్వాలు పేదవర్గాలకు సామాజిక రక్షణ పథకాలు చెయ్యాలి. పేద కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చెయ్యాలి.
పేద వర్గాలకు ఉచిత విద్య ‘వైద్యం తాగునీటి సౌకర్యం ‘గృహవసతి ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు మెరుగు పరచాలి. అవస్థాపన పెట్టుబడులు పెంచాలి.
కరువులు ‘అంటువ్యాధుల నివారణ ‘ఆర్థిక అస్థిరత అరికట్టాలి సుస్తిరాభివృదికి దారితీసే అభివృధి కార్యాచరణకు పూనుకోవాలి . బాలలసర్వతోమఖాభివృద్ధిలక్ష్యంగప్రయోజన కరమైన ఆర్థికవృద్ధిని పెంచే బహుముఖ “అభివృధి వ్యూహాన్ని” అమలు చెయ్యాలి.
2010 నుండి అమలు అవుతున్న ప్రాథమిక నిర్భంధ విద్యా హక్కును
అమలుచేయడంలో ప్రభుత్వ యంత్రాంగం ముఖ్య పాత్ర పోషించాలి.గ్రామీణ ప్రాంతాలలో నగరాలలో “మురికి వాడల్లో” నివసించే పేదలను అక్షరాస్యులను చెయ్యాలి . పేదల కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగు పరచాలి. ఉపాధి అవకాశాల కల్పన విస్త రణ పేదరిక నిర్మూలన ఉత్పత్తి ఉత్పాదకత పెంపు ఆదాయ సృష్టి ఆదాయ పంపిణీ ఏకకాలములో జరిగే విధంగా ప్రభుత్వాల పాలన యంత్రాంగం చర్యలు చేపట్టాలి.
మనదేశంలో ప్రభుత్వం పేదరికం
నిరుద్యోగం ‘ఆర్థిక ‘అసమానతల
ఆకలి చావులు ‘లింగ వివక్ష సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలి .ఆరోగ్య భీమా పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి.
బాలల్లో పౌష్ఠికాహారం కొరతను అధిగమించేందుకు మధ్యాన్న భోజనం ఉచిత ‘ఆరోగ్య సంరక్షణ పరీక్షలు “విటమిన్ టాబ్లెట్స్” ఉచితంగా అందించాలి. బాలల హక్కుల రక్షణ లో పౌరసమాజం స్వచ్ఛంద సంస్థలు క్రియాశీలక పాత్ర పోషించాలి.
రాజ్యాంగం బాలల హక్కుల రక్షణ
మహిళా శిశు సంక్షేమ శాఖ కార్మిక మంత్రిత్వ శాఖ సమిష్టిగా బాలల అభివృధి సంక్షేమ చట్టాలను పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్ళాలి పేద వర్గాల ప్రజలను సామాజిక ఆర్థిక అభివృధి ప్రణాళికలో భాగస్వాములను చెయ్యాలి.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 23 ప్రకారం అన్ని రకాల బలవంతపు వెట్టి చాకిరీ ప్రమాదకరమైన గనుల్లో పనుల్లో బాలల చేత పని చేయించడం నిషేధాన్ని అమలు చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ప్రకారం బాలలకు స్వేచ్ఛ ‘గౌరవం అహల్లాధకరమైన వాతావరణంలో బాలలకు ఎదిగే అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.
పేదవర్గాల బాలకు ఉచితంగా డిజిటల్ టెక్నాలజీ పరికరాలు అందించాలి .బాలల హక్కుల సంరక్షణ చట్టాలు సమర్ధ వంతంగా
అమలు చెయ్యాలి.
“బాలల అభివృద్ధే దేశాభివృద్ధి” లక్ష్యంగా ప్రభుత్వాలు సమగ్రమైన అభివృధి వ్యూహలతో బాలలకు బంగారు భవితను కలిపించాలి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
హైదరాబాద్ 9440245771