తెలంగాణ గ్రూప్ -1 వివాదం: సుప్రీంకోర్టుకు చేరింది!

హైదరాబాద్: అక్టోబర్ 18

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్‌లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది, దీనిపై అభ్యర్థనలు ఇంకా కొనసాగుతున్నాయి.

  • అడ్వకేట్ మోహిత్ రావు
  • సోమవారం ప్రారంభమయ్యే మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • కోర్టు ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
  • గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది, ఇది హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పాస్ ఓవర్ కావడంతో వేరే మార్గంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 

  • గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి, ఈనెల 21 నుంచి తెలంగాణలో నిర్వహించేందుకు ప్రణాళికలు ఉన్నాయి.
  • గత 13 ఏళ్లుగా తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలు జరగలేదు. 2023లో ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి కానీ, పేపర్ లీక్ కారణంగా అవి రద్దు అయ్యాయి.
  • కొందరు అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించక పోవడంతో తమకు అన్యాయం జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యం లో, గత రెండు రోజులుగా కొంతమంది అభ్యర్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించింది.

Leave a Comment