సమాజ సేవల్లో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం
ప్రొద్దుటూరు, జనవరి 06 మనోరంజని తెలుగు టైమ్స్
సమాజ సేవల్లో తనదైన ముద్ర వేస్తూ మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతని అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ను ఫోన్ ద్వారా సంప్రదించారు.
సమాచారం అందగానే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు ఈరోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం వృద్ధుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, అశోక్ కుమార్, కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు, సుమన్ బాబు, ప్రసన్న కుమార్, కిరణ్ కుమార్, నరేంద్ర తదితరులు కార్యక్రమానికి చేయూత అందించారు.
ఇలాంటి మానవతా కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శ్రీ అమ్మ శరణాలయంలో నివసిస్తున్న వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ముందుకు రావాలని వారు కోరారు.
సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్లను సంప్రదించవచ్చు:
82972 53484, 9182244150