ఒకే రోజు భార్యాభర్తలు కలెక్టర్లు గా బాధ్యతలు!
మనోరంజని ప్రతినిధి
అమరావతి:సెప్టెంబర్ 14
పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ గా కృతికాశుక్ల శనివారం పదవి బాధ్యత లు చేపట్టింది, ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆమెను నెల్లూరు జిల్లాకు బదిలీ చేసింది, గతంలో ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గా పనిచేసిన కృతిక శుక్ల పల్నాడు జిల్లా కలెక్టర్గా శనివారం రోజునే పదవీ బాధ్యతలు చేపట్టగా… నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, పదవి బాధ్యతలు చేపట్టారు.దంపతులు ఇద్దరూ ఒకే రోజు కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టడంతో కుటుంబం, బంధువులను, సన్నిహితులను ఆనంద పరవశులని చేసింది.
2013 బ్యాచ్కు చెందిన ఈ దంపతులు ఒకరు ఉత్తరప్రదేశ్కు చెందిన వారు కాగా మరొకరు హర్యానా కు చెందిన వారు. వీరు మన రాష్ట్రంలో కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా, హెచ్ఓడీలుగా, ఇంకా అనేక శాఖలకు అధిపతులుగా పనిచేశారు. సాధారణంగా ఐఏఎస్కు ఎంపిక కావడమే ఒక గొప్ప. ఐఏఎస్, సాధించడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవుతారు…
చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. అలా విజయం సాధించిన వారికి కలెక్టర్గా పనిచేసే అవకాశం రావడం..వారి జీవితంలో మరిచిపోలేని రోజు. ఒక జిల్లాకు కలెక్టర్ గా పని చేయడం ఐఏఎస్ సాధించిన వారికో గొప్ప గౌరవం.సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లుగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించడంతో వీరిద్దరికీ ఒకేసారి కలెక్టర్లుగా పనిచేసే అరుదైన అవకాశం లభించిందని చెప్పవచ్చు. తమకు వచ్చిన అవకాశం తో పేదలకు సేవచేస్తామని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు తమపై పెట్టిన బాధ్యతలకు న్యాయం చేస్తామని వారు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలయమైన పల్నాడు జిల్లాలో ఆయన భార్య కృతికా శుక్లాకు పలు ఛాలెంజ్లు ఎదురుకాను న్నాయి. నరసరావుపేట ఎంపీ తోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీ కి చెందిన వారే కావడం…ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేయడం సవాల్తో కూడుకున్నదేనని చెప్పాలి. ఏది ఏమైనా..దంపతులు ఇద్దరూ..ఒకేసారి కలెక్టర్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైనం… మహత్తర అంశం.