రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి పేరు
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాసిన వీలునామాలో రహస్య వ్యక్తి పేరు ఉన్నట్లు సమాచారం. జార్ఖండ్లోని రాష్ట్రంలోని జంషెడ్పూర్కు చెందిన మోహినీ మోహన్కు రూ.500 కోట్లకు పైగా విరాళంగా ఇవ్వాలని అందులో రాసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న టాటా కుటుంబం, సన్నిహితులు ఆశ్చర్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.