నగరంలో వైభవంగా వారాహి మాత నవరాత్రి ఉత్సవాల ముగింపు

నగరంలో వైభవంగా వారాహి మాత నవరాత్రి ఉత్సవాల ముగింపు

ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

నిజామాబాద్, జూలై 7:

అమ్మ వెంచర్ లో గల వారాహి మాత ఆలయంలో ఘనంగా నిర్వహించిన వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఉత్సవాలను మాంచాల జ్ఞానేందర్ దంపతులు అంకితభావంతో నిర్వహించారు.

ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి నగర బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

“నగరంలో తొలిసారిగా ఇంత వైభవంగా వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు జరగడం ఎంతో హర్షణీయం. మహిళా భక్తుల పాల్గొనడం అభినందనీయం. ఆలయ అభివృద్ధికి జ్ఞానేందర్ దంపతులు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఈ ఆలయానికి శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు ఉండడం మహత్తరమైన విషయం,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేదపండితుల పర్యవేక్షణలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. ఆలయం అభివృద్ధికి భక్తుల సహకారం కోరుతూ ఎమ్మెల్యే గుప్త పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment