రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.*

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.*

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ జులై 30 – అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
బుధవారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపెల్లి గ్రామ రైతు వేదికలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులు పేదలకు వరంగా మారాయన్నారు. ఖానాపూర్ మండలంలో మొత్తం 1,669 కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు 2,532 కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం జరిగింది. వచ్చే నెల నుంచే లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంకా అర్హులైన వారు మిగిలి ఉంటే, వారు దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు మండలంలో మొత్తం 4201 కొత్త కార్డులు మంజూరయ్యాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా కొత్త కార్డుల మంజూరుల్లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. పెన్షన్లు, రైతు రుణమాఫీ, యువకిరణాలు వంటి పథకాలు కార్డుల లేకపోవడంతో అర్హులకు మంజూరు కాలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహాలక్ష్మి ఫ్రీ బస్సు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, రూ.500కి గ్యాస్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కడెం ప్రాజెక్టు మారమ్మత్తులకు 9కోట్ల 40 లక్షలు, సదర్మాట్ కెనాల్ మరమ్మతులకు రూ.39 లక్షలు, ఖానాపూర్ పట్టణానికి త్రాగునీటి సదుపాయం కోసం అమృత్ పథకం కింద రూ.20 లక్షలతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం కలెక్టర్, శాసనసభ్యులు కలిసి మహిళలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళ పథకం కింద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, వైస్ చైర్మన్అ మాజీద్, పి ఏ సి ఎస్ చైర్మన్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఎస్ఓ రాజేందర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సునీతతో పాటు పలువురు అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment