- గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆధిపత్యం, నిధుల అడ్డంకులు.
- అన్ని పంచాయతీ అధికారాలను ‘అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’కి మళ్లింపు.
- పంచాయతీల ఆదాయ వనరులు, అనుమతుల ఫీజులలో కోత.
- ప్రజలపై అధిక పన్నుల భారం, సదుపాయాల లేమితో గ్రామ పంచాయతీలు కుంటుపడుతున్నాయి.
గ్రామ పంచాయతీలకు నిధుల అడ్డంకులతో పాటు అధికారాలు తగ్గిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ ప్రజలపై భారీ పన్నుల భారం మోపుతోంది. పంచాయతీల అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మారింది. నారాయణపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు ద్వారా జిల్లాలోని 245 పంచాయతీలు నష్టపోతున్నాయి.
గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష చూపుతూ నిధులు విడుదల చేయడం ఆపివేసింది. ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీ అధికారాలను ‘అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’కి మళ్లించడం ద్వారా పంచాయతీల ఆదాయాన్ని, ఫీజులను రాష్ట్ర ఖజానాకు మళ్లిస్తోంది. పంచాయతీల అనుమతులు, ఫీజులు గ్రామస్థాయిలో స్వల్ప వ్యయంతో పొందే అవకాశం ఉండగా, ఇప్పుడు అధిక వ్యయం చెల్లించి, అదనపు సమయం వెచ్చించి జిల్లా కార్యాలయాలను ఆశ్రయించవలసి ఉంటుంది. నారాయణపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో జిల్లా పంచాయతీలకు నష్టం, పన్నుల భారం ప్రజలపై పడనుంది.