సీఎం సభను విజయవంతం చేయాలి

సీఎం సభను విజయవంతం చేయాలి

ముధోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పిలుపు

ముధోల్, జనవరి 15 (మనోరంజని తెలుగు టైమ్స్):

జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ముధోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సభకు మండలంతో పాటు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. జిల్లాలోని మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్ మార్ట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొననున్నారని విఠల్ రెడ్డి వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment