*తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు చిన్న బ్రేక్!*
*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*
హైదరాబాద్:అక్టోబర్ 09
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై గురువారం మధ్యంతర స్టే విధించింది హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు విధించింది ఇదేవిధంగా ప్రభుత్వ కౌంటర్ పై పిటిషనర్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారల గడువువిధించింది,
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రెడ్డి జాగృతి నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 27న హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు
అనంతరం విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. నిన్న ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. బీసీ కులగణన చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు.
మార్చిలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై గవర్నర్ కు ఆర్డినెన్స్ ను అందించామ న్నారు. అది ఇంకా పెండిగ్ లోనే ఉంద న్నారు. గడువు ముగియ డంతో చట్టంగా మారినట్లే భావించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లపై పరిమితి లేదని మరో అడ్వకేట్ రవివర్మ వాదనలు వినిపించారు.
50 శాతం పరిమితికి మించొద్దని కూడా లేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. నిన్న పిటిషనర్ తరఫున లాయర్లు వాదనలు వినిపిస్తూ.. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వ డం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు.
గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉన్న సమయంలో జీవో తీసుకురావడం సరికాద న్నారు. రేవంత్ సర్కార్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న రేవంత్ సర్కార్ కు ఈ నిర్ణయం బిగ్ షాక్ గా మారింది. దీంతో నెక్ట్స్ ఏం చేయాలనే అంశంపై ఈ రోజు సాయంత్రం న్యాయనిపుణులతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కోర్టు నిర్ణయానికి సంబం ధించిన పూర్తి ఉత్తర్వులు వెలువడ్డ తర్వాత పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల కమిషన్ సైతం కోర్డు ఆర్డర్ కు సంబంధించిన పూర్తి కాపీ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాచరణపై సాయంత్రంలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.