తానూర్: పేద విద్యార్థుల కోసం సమత ఫౌండేషన్ నిరంతరం కృషి

Alt Name: Samatha Foundation Mamatha Recognition
  1. సమత ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ రావు ప్రకటన.
  2. మమతకు శాలువతో సత్కారం మరియు ఆర్థిక సహాయం.
  3. ఫౌండేషన్ పేద విద్యార్థుల పట్ల నిబద్ధత.

Alt Name: Samatha Foundation Mamatha Recognition

: తానూర్ మండలంలో మసల్గా గ్రామానికి చెందిన గైక్వాడ్ సంగీత గంగాధర్ కుమార్తె మమత రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో ప్రదర్శించిన ప్రతిభకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా, ఆమెను తానూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శాలువతో ఘనంగా సత్కరించారు మరియు రూ. 24,000 ఆర్థిక సహాయం అందించారు.

 సమత ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ రావు మాట్లాడుతూ, పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Alt Name: Samatha Foundation Mamatha Recognition

మమతను ఆదరించడం గర్వకారణమని, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె ప్రదర్శించిన ప్రతిభపై గర్వంగా ఉన్నారు. ఫైనల్ రాణిస్తే, రూ. 1 లక్ష మరియు ఎరోప్లెన్ టికెట్ సహాయాన్ని అందించేందుకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హెచ్ పుండలిక్, మాజీ సర్పంచ్ మాధవరావు పటేల్, సమత ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు మరియు అనేక మంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment