కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
M4 న్యూస్
నిర్మల్ జిల్లా, సారంగాపూర్:
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోయా చిక్కుడు కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కౌట్ల (బి) సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా చిక్కుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
రైతులు పండించిన సోయా చిక్కుడును కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించి క్వింటాలుకు రూ.4892/- ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటి ఛైర్మెన్ నారాయణ రెడ్డి, మార్కెట్ కార్యదర్శి సొసైటీ సీఈఓ సలీం, రైతులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.