భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ టీం పర్యటన.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
భీమారం మండలం, కొత్తపల్లి గ్రామ పంచాయతీ లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ టీం పర్యటించారు. రీజినల్ రిసోర్స్ పర్సన్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీ బృందం పరిశీలించడం జరిగింది.ఈ యొక్క పరిశీలన లో భాగంగా అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను, సెగ్రేగేషన్ షెడ్ లను పరిశీలించినరు, తదనంతరం గ్రామస్తులతో ముఖాముఖీ సంభాషించి తడి చెత్త మరియు పొడి చెత్త ల అమలు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ పర్యటన లో పంచాయతీ పి.వసుంధర , ఫీల్డ్ అసిస్టెంట్ కిష్టయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు