సూర్యాపేట: ‘భారీ వర్ష సూచనలు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి’
భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన లో మాట్లాడుతూ కూలి పోయే ఇళ్లు , పాఠశాలలకు దూరంగా ఉండాలన్నారు. వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల వద్దకు సెల్ఫీలు వెళ్ళవద్దన్నారు. విద్యుత్ స్తంభాల పక్కన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్త ఉండాలన్నారు. ప్రయాణ సమయంలో రోడ్లపై వాహనాలు నిదానంగా నడపాలన్నారు