సదర్‌మట్ బ్యారేజ్ ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలి

సదర్‌మట్ బ్యారేజ్ ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలి

జనవరి 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – అశేషంగా తరలిరావాలి

ముధోల్ కాంగ్రెస్ ఇంచార్జి భోస్లే నారాయణరావు పాటిల్ పిలుపు

భైంసా, జనవరి 14 (మనోరంజని తెలుగు టైమ్స్):

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 16-న నిర్వహించనున్న సదర్‌మట్ బ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి విచేస్తున్న నేపథ్యంలో, ఆ సందర్భంగా జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పాటిల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని **ఎన్టీఆర్ స్టేడియం (జూనియర్ కాలేజీ ప్రాంగణం)**లో జరిగే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముధోల్ నియోజకవర్గ ప్రజలు అశేషంగా తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన సదర్‌మట్ బ్యారేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను ఘనంగా నిర్వహించడం పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ఆత్మ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్‌లు, డైరెక్టర్లు, మహిళా విభాగం నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
సీఎం పర్యటన సభను విజయవంతం చేయడం ద్వారా నిర్మల్ జిల్లా ప్రజల ఐక్యతను, కాంగ్రెస్ పార్టీ బలాన్ని చాటిచెప్పాలని భోస్లే నారాయణరావు పాటిల్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment