సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి

కామారెడ్డి, జనవరి 15 (మనోరంజని తెలుగు టైమ్స్):
సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయంలో గురువారం వేకువ జామున మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హారతులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగించాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక భావనతో జీవిస్తే మనసుకు శాంతి కలుగుతుందని, సమాజంలో సౌహార్దం పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులతో పాటు మధు, శేఖర్, కిట్టు తదితర భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment