విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠశాల భవనం కూలడం-పలువురు విద్యార్థులకు గాయాలు-పరామర్శించిన SJWHRC ప్రతినిధి డాక్టర్ సాప పండరి

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠశాల భవనం కూలడం-పలువురు విద్యార్థులకు గాయాలు-పరామర్శించిన SJWHRC ప్రతినిధి డాక్టర్ సాప పండరి

నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని అంతర్నీ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రారంభించి, విద్యార్థులను పిలిపించి ఒక ఫోటో దిగి, పుస్తకంలో అక్కడే పెట్టేసి వెళ్లిపోవడంతో, అక్కడే ఉన్న విద్యార్థులు శిథిలవస్థలో ఉన్న పాఠశాల భవనం వద్దకు వెళ్లి ఆడుకోవడంలో నిమగ్నం కాగా భవనం స్లాబ్ ఒకే సారి కూలడంతో నలుగురు విద్యార్థులకు గాయాలు, ఒక విద్యార్థికి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థి భైంసా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్సలో భాగంగా ఎడమ కాలు మూడు చోట్ల విరిగి ఎముకలు బయటకు రావడం జరిగింది. సంఘటన జరిగిన 20 గంటలకు MEO విద్యార్థికి వచ్చి పరామర్శించి వెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు DEO రాకపోవడం, సంఘటనపై విచారణ జరుపకపోవడం విచారకరం. నూతన పాఠశాల ప్రారంభ దశలోనే ఇటువంటి సంఘటనలు ఎదురైతే విద్యార్థులను తల్లిదండ్రులు ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ ఇట్టి విద్యార్థికి పూర్తిస్థాయిలో ఆరోగ్యం కుదుటపడే వరకు ప్రభుత్వం పట్టించుకోని, ఆర్థిక సహాయాన్ని అందించాలని తెలియజేశారు. అంతేకాకుండా DEO విద్యాధికారి జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి వెళ్లి పాఠశాల భవనాలు ఏ విధంగా ఉన్నాయో గమనించి, విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, మరో మారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అలికే దత్తాత్రి,అంతర్నీ ఐలేశ్వర్, తల్లిదండ్రులు సుజాత రాజేశ్వర్, పలువురు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment