భైంసాకు చేరిన సేవాలాల్ మహారాజ్ పల్లకి యాత్ర
ఎమ్మెల్యే నివాసంలో భక్తుల బస
అక్కడే భోజన ఏర్పాట్లు
మనోరంజని ప్రతినిధి భైంసా సెప్టెంబర్ 21
లోక కళ్యాణార్థం కోసం ప్రతి సంవత్సరం చేపట్టే సేవాలాల్ మహారాజ్ పల్లకి యాత్ర ఆదివారం బైంసాకు చేరుకుంది. మదనాపూర్ గంగేశ్వర్ మహారాజ్ ఆధ్వర్యంలో మర్లగొండ గాలి సింగ్ తండా నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. భైంసాకు రావడంతో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భక్తులకు, గంగేశ్వర్ మహారాజ్ కు ఘన స్వాగతం పలికి కాసేపు పల్లకిని మోశారు. అనంతరం అక్కడే పూజ నిర్వహించి, గంగేశ్వర్ మహారాజ్ బస చేశారు. భక్తులకు ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో భోజన. ఏర్పాట్లు చేశారు. కాసేపు విడిది చేసి భక్తులు బాసరకు పయనమయ్యారు. కార్యక్రమంలో భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, సీనియర్ నాయకులు సొలంకి భీమ్రావ్, బిజెపి పట్టణ అధ్యక్షులు రావుల రాము తో పాటు పలువురు పాల్గొన్నారు.