గొలుసులతో బంధించి పంపించారు! అమెరికా చర్యలపై తీవ్ర విమర్శలు

Indian Migrants Shackled During US Deportation
  • అక్రమ వలసదారులను నిర్బంధించి, స్వదేశాలకు పంపుతున్న అమెరికా.
  • 104 మంది భారతీయులను భారత్‌కు పంపించినట్టు అధికారిక సమాచారం.
  • గొలుసులతో బంధించి తరలించారని బాధితుల వాదన, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు.
  • కేంద్రం మాత్రం ఈ ఆరోపణలను తప్పుడు ప్రచారంగా కొట్టిపారేసింది.

 

అమెరికా అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ 104 మంది భారతీయులను స్వదేశానికి పంపింది. అయితే, వారిని విమానంలో కాళ్లు, చేతులు గొలుసులతో కట్టేసి తరలించారని బాధితులు చెబుతున్నారు. స్వదేశానికి చేరిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ తమ అనుభవాలను వెల్లడించగా, ఈ ఘటనపై పెద్ద చర్చ ప్రారంభమైంది.

అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు అక్రమంగా ఉన్న వలసదారులను ప్రత్యేక నిర్బంధ శిబిరాలకు తరలించి, అక్కడ వారు ఎవరి సంప్రదింపులకూ అనుమతించకుండా కఠిన నిబంధనలు అమలు చేశారని సమాచారం. అనంతరం విమానంలో కూర్చోబెట్టి చేతులు, కాళ్లు గొలుసులతో బంధించి తరలించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇదే విషయం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. కొందరు వైరల్ అవుతున్న ఫోటోలు చూపిస్తూ అమెరికా చర్యలను ఖండిస్తుంటే, మరోవైపు భారత ప్రభుత్వం ఇవన్నీ తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేసింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి – “భారతీయుల పట్ల అమెరికా అమానవీయంగా వ్యవహరిస్తుంటే, కేంద్రం ఏ చర్యలు తీసుకుంటుంది?” అని నిలదీస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment