ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
అలంపూర్, అక్టోబర్ 28, 2024
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామపంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్గా తనను ఎన్నుకుంటే, ఒకేసారి 2 కోట్లు ఇస్తానని ఒక వ్యక్తి ప్రకటించాడు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గ్రామానికి చెందిన పూల మద్దిలేటి అనే వ్యక్తి, గ్రామ ప్రజలకు తనను సర్పంచ్గా ఎన్నుకోవాలని సూచిస్తూ ఈ ప్రకటన చేశాడు. పోటీ లేకుండా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే పంచాయతీ పరిధిలోని ప్రజలకు పండగల సందర్భంగా 2 కోట్ల రూపాయలు అందించడానికి సిద్ధమని తెలిపాడు.
గతంలో సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు ఒక్కొక్కరికి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని, అందుకేనేమో ఈ అభ్యర్థి ‘ఒకేసారి 2 కోట్లు ఇస్తా’ అంటూ చెప్పడం గూర్చి ఎర్రవెల్లి గ్రామ ప్రజలు గుసగుసలాడుతున్నారు.