గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

అమరావతి: అక్టోబర్ 16

వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం రేపల్లె నుంచి చీరాల వైపు వస్తున్న సమయంలో కర్లపాలెంకి దగ్గర ముకుంద టీ స్టాల్ వద్దకు రాగానే డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చిందని తెలిపారు.

అప్పటికే డ్రైవర్ చాకచక్యంతో బస్సును పొలాల్లో మళ్లించాడు. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దింపేలోపే, డి. సాంబశివరావు గుండె పోటుతో మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Comment