రైస్ మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
4 ప్రతినిధి ముధోల్

వరికొనుగోళ్ల విషయంలో రైస్ మిల్లర్లు రైతులకు కోత విధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం కోత విధించవద్దన్నారు. శనివారం భైంసా మండలంలోని దేగాం, వలేగాం, కుంసరా, ఎగ్గామ్, వానల్పాడ్, పెండ్ పెల్లి గ్రామాల్లో పిఎసిఎస్-డిసిఎంఎస్ ల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోత విధించవద్దని రైతుల పక్షాన జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం జరిగిందని, అక్రమాల నివారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యా, వైద్యం, రైతాంగానికి సాగునీరు అందించడమే ధ్యేయంగా తాను పనిచేస్తున్నానని దశలవారీగా సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. దేగాం గ్రామానికి చెందిన నాయకులు పలు సమస్యలు విన్నవించడంతో సిరాల ప్రాజెక్టు ద్వారా దేగాం రైతంగానికి సాగునీరు అందిస్తానన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను,పరిష్కరించేందుకు తనవంతుగా పాటుపడతానన్నారు. కార్యక్రమాల్లో పిఎసిఎస్ చైర్మన్ ఆమెడ దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు సోలంకి భీమ్రావు, సాంళి రమేష్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, గణేష్ పటేల్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు దిగంబర్, సాయినాథ్, ప్రసాద్, చందర్ పటేల్, సాయ రెడ్డి, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, పిఎసిఎస్ సెక్రటరీ, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.