ముధోల్ డిగ్రీకళాశాలలో పోస్టులను భర్తీ చేయండి
ఉన్నత విద్యమండలి చైర్మన్ కలిసిన ఎమ్మెల్యే
ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 17
ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీచింగ్- నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి.బాలకృష్ణారెడ్డిని కోరారు. ముధోల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆయన చైర్మన్ కు వినతి పత్రాన్ని అందించారు. కళాశాలలో థర్డ్ ఇయర్ ప్రారంభమైన సందర్భంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని, దానికి అనుగుణంగా లెక్చరర్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను నియమించాలన్నారు. దీనికి చైర్మన్ స్థానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెద్దోల్ల విఠల్, మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షులు రోళ్ల రమేష్, మాజీ సర్పంచ్ అనిల్, నాయకులు ధర్మ పురి సుదర్శన్, తాటివార్ రమేష్, సంజీవ్ తో సౌంవ్లీ రమేష్, పండిత్ రావ్, తదితరులున్నారు