హైదరాబాద్: అక్టోబర్ 16
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ వీ. బాల కిష్టారెడ్డిని నియమించారు. అలాగే, వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ బాల కిష్టారెడ్డి న్యాయ కళాశాలలో సేవలందించిన అనుభవం కలిగి ఉన్నారు. ప్రొఫెసర్ పురుషోత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో సేవలందించి ఇటీవల పదవీ విరమణ పొందారు.
ముందు ఉన్నత విద్యామండలి తాత్కాలిక చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, 2023లో పూర్తిస్థాయి చైర్మన్ హోదాను స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన 2023 జూలైలో పదవీ విరమణ పొందారు.
#ఉన్నతవిద్యామండలి #తెలంగాణవిద్య #చైర్మన్ #ప్రొఫెసర్బాలకిష్టారెడ్డి #ప్రొఫెసర్పురుషోత్తం