M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 23
- ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు
- కాంగ్రెస్ నాయకుల హాజరు
- భారీ రోడ్షో
కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
బుధవారం ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ భారీ రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ ఎదుట నామినేషన్ దాఖలు చేయనున్నారు.