తొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి
నటుడు దళపతి విజయ్ మీటింగ్లో తొక్కిసలాట ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట వంటి సంఘటన గురించి తెలిసి తీవ్ర వేదనకు గురయ్యాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’అని పేర్కొన్నారు