నేటి బంద్ ను విజయవంతం చేయాలి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్

నేటి బంద్ ను విజయవంతం చేయాలి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్

నేటి బంద్ ను విజయవంతం చేయాలి

జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఈనెల 18 న చేపడుతున్న రాష్ట్రవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. అగ్ర కులాలు వారు ఓర్వలేక హైకోర్టులో కేసు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిస్తూ.. రాజకీయ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలను ఎదగకుండా అడ్డుపడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా వెనుకకు నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, బంద్ లు పాటిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంద్ కు అన్ని పార్టీలు మద్దతు తేలిపాయని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. ఇందులో బీసీ సంఘం జాతీయ నాయకులు అనుముల భాస్కర్, డాక్టర్ కత్తి కిరణ్, అశోక్ నాయక్ , ప్రశాంత్ , శివాజీ గౌడ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment