చిన్న ఆత్మకూర్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

చిన్న ఆత్మకూర్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించిన మనోహర్ రెడ్డి

మనోరంజని తెలుగు టైమ్స్ కామారెడ్డి జిల్లా: డిసెంబర్ 14

రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో నూతనంగా ఏర్పాటైన చిన్న ఆత్మకూర్ గ్రామ పంచాయతీలో ఆదివారం పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డుకు చెందిన పోలింగ్ బూత్‌లో మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి తొలుత ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన సతీమణి పవిత్ర, కుమారులు సచిత్ రెడ్డి, నిచిత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించారు.ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ…
నాలుగో వార్డులో మొత్తం 74 ఓట్లు ఉన్నాయని, వందకు వంద శాతం పోలింగ్ జరిగేలా ప్రతి ఓటరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ఎన్నికల ద్వారా సరైన ప్రతినిధులను ఎన్నుకుంటేనే పల్లెల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టగా, ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment