మిర్యాలగూడ, జూలై 4
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను ఎటువంటి తప్పులు లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ బిఎల్ఓలను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్, బిఎల్ఓలను ఆదేశించారు. శనివారం ఆయన మిర్యాలగూడ మున్సిపాలిటీ లో 3 వ వార్డులో 133, 134 పోలింగ్ కేంద్రాల పరిధిలో బిఎల్ఓలు నిర్వహిస్తున్న "సర్" కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఎన్యుమరేషన్ ఫారాలలో 2002 జాబితాలో ఉన్న వారి వివరాలు, లేని వారి వివరాలు నమోదు, అలాగే బిఎల్ఓలతో పాటు ఉన్న ఫారం 6, 7, 8 ల పై ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బిఎల్ఏలు సర్ కార్యక్రమానికి సహకరిస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.
సర్ కార్యక్రమాన్ని పూర్తి జాగ్రత్తగా నిర్వహించాలని, తప్పులు ఉండరాదని, పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన వారందరు తిరిగి ఇస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అందుబాటులో లేకుంటే మరోసారి ఆ ఇంటిని సందర్శించి అలాంటి వారి వివరాలు కూడా నమోదు చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ రామకృష్ణ పాల్గొన్నారు.












