- బీజేపీ ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’ పోస్టర్ విడుదల
- ఆప్ ‘కేజ్రీవాల్ ఝుకేగా నహీ’ పుష్ప-స్టైల్ కౌంటర్
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు పోస్టర్ వార్ హీట్
పుష్ప-2 సినిమాకు దేశవ్యాప్తంగా మేనియా కొనసాగుతుండగా, రాజకీయాలు కూడా దాని ప్రభావానికి లోనయ్యాయి. బీజేపీ “కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు” పోస్టర్కు ఆప్ పుష్ప-స్టైల్ కౌంటర్ ఇచ్చింది. “కేజ్రీవాల్ ఝుకేగా నహీ” ట్యాగ్తో రూపొందించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పోస్టర్ వార్ రాజకీయ వేడిని పెంచింది.
దేశవ్యాప్తంగా పుష్ప-2 సినిమా ప్రభావం కేవలం సినిమా ప్రేమికులకే కాదు, రాజకీయాల్లోనూ కనిపిస్తోంది. ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య పోస్టర్ వార్ ఇప్పుడు రాజకీయ హీట్ పెంచుతోంది.
బీజేపీ శనివారం విడుదల చేసిన పోస్టర్లో కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేశారు. మద్యం విధానం, మొహల్లా క్లినిక్లు, హవాలా, రేషన్ స్కాంలు వంటి అంశాలను హైలైట్ చేస్తూ ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’ అంటూ ట్యాగ్లైన్ ఇచ్చింది.
దీనికి కౌంటర్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం “కేజ్రీవాల్ ఝుకేగా నహీ” పుష్ప స్టైల్ పోస్టర్ను విడుదల చేసింది. పుష్ప సినిమాకు ప్రేరణగా తీసుకుని కేజ్రీవాల్ ఫేస్తో చీపురు పట్టిన అవతారంలో ఈ పోస్టర్ రూపొందించారు. “కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్” అంటూ ట్యాగ్లైన్తో ఆప్ తమ విజయభావాన్ని స్పష్టం చేసింది.
ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పోస్టర్ వార్ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.