అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల దినం కార్యక్రమాలు
విద్యార్థులకు ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ
జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల
నిర్మల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 16
పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిధిలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినం పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా కార్యక్రమాలను అక్టోబర్ 21వ తేది నుండి అక్టోబర్ 31వ తేది వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పత్రిక సోదరులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయ వంతం చెయ్యాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. అక్టోబరు 21 నుండి 25వ తేది వరకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి అందులో పోలీసు విధులు, పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక వినియోగం, షి టీం, భరోసా, సైబర్ సెక్యూరిటీ, ఆంటీ నార్కోటిక్ డ్రగ్, డాగ్ స్క్వాడ్ విభాగాల విధులు, ప్రజల రక్షణ లో పోలీసుల సేవలు, పోలీసులు చేసిన ప్రతిభ, త్యాగాలు మొదలగునవి విషయాలను ప్రజలకు, విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది. వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వ్యాసరచన పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అభ్యర్థులు పాల్గొనవచ్చును. రాసిన వ్యాసాన్ని ఆన్లైన్లో గూగుల్ ఫామ్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. వ్యాసరచన అంశం డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశాల మీద విద్యార్థులకు “ఆన్లైన్ నందు వ్యాసరచన పోటీలు నిర్వర్తించడం జరుగుతుంది ఆన్లైన్లో 24 అక్టోబర్ 2025 వరకు సమర్పించవచ్చును. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అభ్యర్థులను జిల్లా పోలీస్ కార్యాలయంలో బహుమతుల ప్రధానం చేసి, తదుపరి ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సంపాదించాలని అన్నారు. అదేవిధంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్.ఐ స్థాయి అధికారి వరకు పని చేయు ప్రదేశంలో లింగ వివక్ష, ఎస్.ఐ స్థాయి అధికారి మరియు పై స్థాయి అధికారులకు క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ను బలోపేతం చేయడం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ వ్యాసరచన పోటీలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో నిర్వహించాలని, 500 పదాలకు మించకుండా ఉండాలన్నారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డుల ప్రధానం, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుందని తెలియజేశారు. విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని, ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలను, వీడియోలను జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఫోటోలు, వీడియోలు ఈనెల 24లోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐటి కోర్ ఆఫీస్ లో అందించాలి. ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందనీ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ నెల అక్టోబర్ 21న పోలీస్ ప్రధాన కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద “పోలీస్ అమరవీరులను” స్మరిస్తూ ఉదయం 8:30 నిమిషాలకు పోలీస్ అధికారులు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందని తెలియజేశారు