ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు పెద్దపల్లి ఎంపీ
మనోరంజని తెలుగు టైమ్ ప్రతినిధి అక్టోబర్ 07
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో భారతదేశం తరఫున దేశ అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటివరకు కొద్దిమంది ఎంపీలు మాత్రమే హాజరైన ఈ ప్రతిష్టాత్మక వేదికపై తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించడం విశేషం.