ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్

, వనపర్తి జిల్లా,

అక్టోబర్ 22, 2024:

వనపర్తి జిల్లా పెబ్బేర్ మండల మున్సిప‌ల్ కార్యాల‌యంలో మంగళవారం జరిగిన ఏసీబీ దాడుల్లో, మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మహబూబ్ నగర్ ఏసీబీ అదనపు ఎస్పీ బి. శ్రీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో, కమిషనర్ కాంట్రాక్టర్ నుంచి రూ. 20,000 లు లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Leave a Comment