ట్రిపుల్ ఐటి ఇంచార్జ్ వీసీని కలిసిన ఓయూ జెఎసి నేతలు

  • ట్రిపుల్ ఐటి ఇంచార్జ్ వీసీ గోవర్ధన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఓయూ జెఎసి నేతలు
  • బాసర ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి

బాసర ట్రిపుల్ ఐటి ఇంచార్జ్ వీసీగా నియమితులైన జెఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ను ఓయూ జేఏసీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. బాసర ట్రిపుల్ ఐటీ సంపూర్ణ అభివృద్ధికి కృషి చేయాలని వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు సర్ధార్ వినోద్ కుమార్, సూర్నగంటి రంజిత్ కుమార్, ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి ఇంచార్జ్ వీసీగా నియమితులైన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జెఎన్టీయూ) సీనియర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ను ఓస్మానియా యూనివర్శిటీ (ఓయూ) జేఏసీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా జేఏసీ నేతలు బాసర ట్రిపుల్ ఐటీని నాటి కాంగ్రెస్ హయాంలో వనుక బడ్డ ప్రాంతం అయిన ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి స్థాపించారని, అయితే కేసీఆర్ పాలనలో ప్రభుత్వ యూనివర్శిటీలను పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి దూరమైందని అన్నారు. నేటి ప్రజా పాలనలో బాసర ట్రిపుల్ ఐటీ అభివృద్ధి కోసం చొరవ చూపాలని, ఇక్కడ విద్యార్దులకు మెరుగైన శిక్షణ, సదుపాయాలు కల్పించాలని వీసీని కోరారు.

ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేతలు సర్ధార్ వినోద్ కుమార్, సూర్నగంటి రంజిత్ కుమార్, ప్రవీణ్ రావు, నరహరి గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment