జర్నలిస్ట్‌ల కొత్త అక్రిడిటేషన్లపై మంగళ, బుధవారాల్లో నిర్ణయం…!

జర్నలిస్ట్‌ల కొత్త అక్రిడిటేషన్లపై మంగళ, బుధవారాల్లో నిర్ణయం...!

జర్నలిస్ట్‌ల కొత్త అక్రిడిటేషన్లపై మంగళ, బుధవారాల్లో నిర్ణయం…!

మంత్రి పొంగులేటి

ఖమ్మం/వైరా: జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ , రెవెన్యూ శాఖ ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ వెల్లడించారు. గురువారం వైరాలో టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) నాల్గో జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగంచారు. వచ్చే మంగళ, బుధవారాల్లో అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో యూనియన్ నాయకులతో చర్చించి ఫైనల్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామన్నారు.అక్రిడిటేషన్ కార్డులు సమస్య పరిష్కారమైతే, మిగిలిన హెల్త్ కార్డులు సమస్య ఒక కొలిక్కి వస్తుందన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్నందున ఒక హోదా లో ఉన్న తాను దానిపై ఏమి మాట్లాడటం సరికాదన్నారు. కోర్టు కు సంబంధించిన ప్రతిని మీకు అందిస్తామన్నారు.జర్నలిస్టుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు. మా గెలుపులో మీ పాత్ర ఉన్నందున జర్నలిస్టులకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు

Join WhatsApp

Join Now

Leave a Comment