బాసర అమ్మవారిని దర్శించుకున్న ఇంచార్జీ ఆర్జీవికేటి నూతన విసి

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

బాసర: అక్టోబర్ 19
పవిత్ర పుణ్యక్షేత్రం, చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రంలో శనివారం రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జీ వైస్ ఛాన్స్లర్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా, బాసర ఆలయానికి అధికారులతో చేరుకొని, గర్భగుడిలో కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకొన్నారు. ఆలయ అధికారులు వీరిని ఆలయ మర్యాదలతో స్వాగతించి, వేద పండితులు వేదమంత్రాల మధ్య మహా మంగళ హారతి ఇచ్చి ఆశీర్వదించారు.

అనంతరం, పూలమాల, శేష వస్త్రాలతో సత్కరించి అమ్మవారి తీర్థ లడ్డు ప్రసాదాలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి త్రిబుల్ ఐటీ అధికారులతో పాటు, బాసర ఆలయ పిఆర్ఓ నారాయణ పటేల్, రాజేందర్ మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Leave a Comment