- జర్నలిస్టుల రక్షణ కోసం చట్టం అమలు చేయాలని పురుషోత్తం నరగౌని డిమాండ్
- వరంగల్ జిల్లా కమిటీ పునరవ్యవస్తీకరణ
- చిన్న పత్రికల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఎన్యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నరగౌని, జర్నలిస్టుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ పునర్వ్యవస్థీకరణ జరిగి, కండికొండ మోహన్, అవునూరి కుమారస్వామి, బత్తుల సత్యం తదితరులు కొత్తగా ఎన్నికయ్యారు. చిన్న పత్రికల బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నవంబర్ 15, వరంగల్:
ఎన్యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నరగౌని, జర్నలిస్టుల రక్షణ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ వరంగల్ జిల్లా జర్నలిస్టుల కమిటీ సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పురుషోత్తం నరగౌని మాట్లాడుతూ, జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు, వేధింపులు, తప్పుడు కేసుల పరిపరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వెంటనే జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు:
-
సంక్షేమ పథకాలలో యూనియన్ల జోక్యం లేకుండా చూడాలి
జర్నలిస్టుల సంక్షేమ పథకాలు నేరుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
చిన్న పత్రికలను ఎమ్పానెల్మెంట్లో చేర్చాలి
చిన్న పత్రికలను తక్షణమే గుర్తించి, వాటిని ఎమ్పానెల్మెంట్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. -
మీడియా రంగానికి ప్రత్యేక పాలసీ
జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. -
మీడియా ఉద్యోగుల సంక్షేమం
జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి బీమా, పెన్షన్, ఆర్థిక సహాయ కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.
జిల్లా కార్యవర్గం:
- అధికారులు: కండికొండ మోహన్ (అధ్యక్షుడు), అవునూరి కుమార్ (ప్రధాన కార్యదర్శి), బత్తుల సత్యం (కోశాధికారి)
- ఉపాధ్యక్షులు: లింగబత్తిని కృష్ణ, కందికొండ గంగరాజు, నగపూరి నాగరాజు
- సహాయ కార్యదర్శులు: ఈద శ్రీనాథ్, వల్లేపు భాగ్యరాజ్
- ఆర్గనైజింగ్ సెక్రటరీ: పంచకం నర్సయ్య, అడుప అశోక్, నీరూటి శ్రీహరి, నాగపూరి అవినాష్
- కార్యవర్గ సభ్యులు: గోనె కమలాకర్, సుంకరి కళ్యాణ్, మంతెన సురేష్