- ఫోర్త్ సిటీ పనులు పారదర్శకంగా నిర్వహించాలంటూ ఎన్ హెచ్ ఆర్ సి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తమ్మల్ల అంజనేయులు విజ్ఞప్తి
- కందుకూరు మండలంలోని ముచ్చర్ల వద్ద నిర్మాణాలు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీపై ఆందోళన
- రైతులకు నష్టపరిహారం, ధాన్యంపై దళారీల అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడుతున్న ఫోర్త్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పనులను పారదర్శకంగా నిర్వహించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తమ్మల్ల అంజనేయులు కోరారు. అలాగే, రైతులకు భూములకు నష్టపరిహారం, ధాన్యాన్ని దళారీలకు చేరకుండా చూడాలని సివిల్ సప్లై అధికారులను కోరారు.
తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల వద్ద ప్రారంభించ తలపెట్టిన ఫోర్త్ సిటీ నిర్మాణ పనులను పారదర్శకంగా నిర్వహించాలంటూ జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తమ్మల్ల అంజనేయులు విజ్ఞప్తి చేశారు. ఫోర్త్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మరియు అనేక కంపెనీల పనులను సమగ్రంగా, పారదర్శకంగా, ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా చేయాలని ఆయన కోరారు.
ఇంకా, భూములు ఇచ్చే రైతులకు నష్టపరిహారం మూడింతలు చెల్లించాలని, అంతే కాకుండా రంగారెడ్డి జిల్లాలో ధాన్యం అమ్మకంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా, దళారీలకు రైతుల ధాన్యాన్ని చేరకుండా సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు కనీసం మద్దతు ధరను పొందేలా చూడడం చాలా ముఖ్యమని, అందువల్లే రైతులు అంగీకరించి, అభివృద్ధి దిశగా సాగవచ్చని చెప్పారు.