తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రెండో విడత నిధుల విడుదలను ఈ నెల 20వ తేదీకి మార్చినట్లు సమాచారం. యాసంగి పంటల నేపథ్యంలో రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. రెండో విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ నిధులను ఈ నెల 20వ తేదీలోగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం అవసరమైన నిధులను సమీకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
యాసంగి సీజన్కు రైతు భరోసా నిధులను మూడు దఫాలుగా అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మొదటి దఫాగా రూ.3,446.94 కోట్లను 68.89 లక్షల మంది రైతులకు విడుదల చేశారు. రెండో విడతలో ఐదెకరాల వరకు ఉన్న రైతులకు నిధులు జమ చేయవచ్చని, దీనికి రూ.3,000 నుంచి రూ.4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా.










