జమ్మలమడుగులో బంధువులు లేని వృద్ధుడి అంత్యక్రియలను 'మే ఐ హెల్ప్ యు' ఫౌండేషన్ సభ్యులు హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు.
దొమ్మర నంద్యాల ప్రాంతానికి చెందిన వసువండ్ల సంజీవరాయుడు అనే వృద్ధుడు అనారోగ్యంతో మరణించగా, ఆయన అంత్యక్రియలు చేయడానికి బంధువులు ముందుకు రాలేదు. ఈ విషయాన్ని స్థానికులు 'మే ఐ హెల్ప్ యు' ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్కు తెలియజేశారు.
ఫౌండేషన్ ప్రతినిధులు వెంటనే స్పందించి, హిందూ స్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సేవకు సహకరించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, అహమ్మద్ హుస్సేన్, సుబహన్, ఈశ్వర్ వర్ధన్ రెడ్డి, దస్తగిరి తదితరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫౌండేషన్ 'శవం శివంతో సమానం' అనే నినాదంతో సమాజానికి సేవ చేస్తోంది. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది.
శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయాలనుకునే దాతలు 82972 53484, 9182244150 నంబర్లలో సంప్రదించవచ్చని ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.












