హైదరాబాద్, జూలై 13
హైదరాబాద్లో జరిగిన జేసీఐ ఇండియా జోన్-12 "తేజస్ మిడ్కాన్–2026"లో జేసీఐ నిర్మల్ స్పూర్తి 8 ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుని నిర్మల్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస, నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా ఉత్తమ స్థానిక వ్యక్తిగత వికాస (ఐడీ) కార్యక్రమం విభాగంలో విజేత అవార్డును అందుకుంది.
హైదరాబాద్లోని కత్రియ హోటల్ సోమాజిగూడలో ఘనంగా నిర్వహించిన జేసీఐ ఇండియా జోన్-12 "తేజస్ మిడ్కాన్–2026"లో జేసీఐ నిర్మల్ స్పూర్తి విశేష ప్రతిభ కనబరిచి, మొత్తం ఎనిమిది ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని నిర్మల్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది.
సంస్థ నిర్వహించిన సేవా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణలు, నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా "ఉత్తమ స్థానిక వ్యక్తిగత వికాస (ఐడీ) కార్యక్రమం" విభాగంలో విజేత అవార్డును జేసీఐ నిర్మల్ స్పూర్తి అందుకుంది.
వ్యక్తిగత విభాగాల్లో జేసీ వాడేకర్ లక్ష్మణ్ ఉత్తమ స్థానిక సంస్థ అధ్యక్షుడు (రన్నరప్), జేసీ డాక్టర్ సురేష్ అల్లాడి ఉత్తమ జేసీఐ సభ్యుడు (రన్నరప్), జేసీ సోనియా రాణి ఉత్తమ నూతన మహిళా జేసీఐ సభ్యురాలు (రన్నరప్), జేసీ జాధవ్ అమిత్ నాయక్ ఉత్తమ స్థానిక సంస్థ అధికారి (రన్నరప్) అవార్డులను అందుకున్నారు.
అదనంగా, జేసీఐ నిర్మల్ స్పూర్తి వ్యవస్థాపక అధ్యక్షుడు జేసీ వాడేకర్ లక్ష్మణ్ గారికి సంస్థ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, నాయకత్వంలో చూపిన విశేష కృషికి గాను జోన్ వైస్ ప్రెసిడెంట్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు ప్రదానం చేయడం విశేషం. ఇతర విభాగాల్లో లభించిన అవార్డులతో కలిపి జేసీఐ నిర్మల్ స్పూర్తి మొత్తం ఎనిమిది అవార్డులను కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా జేసీఐ ఇండియా జోన్-12 అధ్యక్షులు జేఎఫ్ఎస్ గౌతమ్ కుమార్ జైన్, రీజియన్–బి జోన్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎం మహేందర్ గుండం జేసీఐ నిర్మల్ స్పూర్తి సభ్యులను అభినందిస్తూ, వారి సేవా కార్యక్రమాలు ఇతర స్థానిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.
ఈ సందర్భంగా జేసీఐ నిర్మల్ స్పూర్తి వ్యవస్థాపక అధ్యక్షుడు జేసీ వాడేకర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఈ విజయానికి నిరంతరం మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించిన జేఎఫ్ఎస్ గౌతమ్ కుమార్ జైన్, జేఎఫ్ఎం మహేందర్ గుండంలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సంస్థ విజయానికి అండగా నిలిచిన జేసీ డి. విశ్వశ్రీ (కార్యదర్శి), జేసీ దుగ్గె అనిల్ (కోశాధికారి), లోకల్ గవర్నింగ్ బోర్డు (ఎల్జీబీ) సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ప్రతి జేసీ సభ్యునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషి, సేవాభావం, అంకితభావం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా సమాజ సేవ, యువత నాయకత్వ వికాసం, వ్యక్తిత్వాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ జేసీఐ నిర్మల్ స్పూర్తిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.












