- షాద్నగర్ బైపాస్ రోడ్డులో బంగారు మైసమ్మ దేవాలయానికి విరాళం
- భూసమితి యువనేత నందారం అశోక్ యాదవ్ ఆధ్యాత్మిక సేవలు
- యాదవ సమాజం అభినందనలు
షాద్నగర్ బైపాస్ రోడ్డు యాదవ కాలనీలో ఉన్న బంగారు మైసమ్మ దేవాలయ అభివృద్ధికి నందారం అశోక్ యాదవ్ రూ. 3.69 లక్షల విరాళం ప్రకటించారు. యాదవ కాలనీ పెద్దల సమక్షంలో ఈ విరాళాన్ని ప్రకటించిన అశోక్ యాదవ్ సేవలను యాదవ సోదరులు ప్రశంసించారు. ఆలయ అభివృద్ధిని యజ్ఞంగా భావిస్తూ, ఆధ్యాత్మిక చింతనతో సేవలందిస్తున్న అశోక్ యాదవ్ గొప్పదనాన్ని కొనియాడారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్డులో ఉన్న యాదవ కాలనీలోని బంగారు మైసమ్మ దేవాలయం అభివృద్ధికి భారత రాష్ట్ర సమితి షాద్నగర్ పట్టణ యువనేత నందారం అశోక్ యాదవ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా యాదవ కాలనీ పెద్దలు నడికుడ రఘునాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, రవికుమార్ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గోపాల్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
అశోక్ యాదవ్ ఈ అభివృద్ధి కార్యక్రమానికి రూ. 3.69 లక్షల విరాళాన్ని గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి యజ్ఞాన్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సేవలంటే ఎనలేని ఆదరణ కలిగిన నందారం అశోక్ యాదవ్ విశేష సేవలందిస్తున్నారని యాదవ సమాజం ప్రశంసించింది.
అశోక్ యాదవ్ తన ఆధ్యాత్మిక చింతనతో ఆలయ అభివృద్ధికి కృషి చేయడంలో ముందుండడం ఎంతో గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడ్డారు.