M4 న్యూస్ – నిఖిల్ రవి
, హైదరాబాద్ (అక్టోబర్ 17):
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన కీలక సమావేశంలో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటే పాల్గొన్నారు. ఈ సమావేశం బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్ గారి ఆధ్వర్యంలో జరిగింది, ఇందులో రాష్ట్ర పార్లమెంట్ మరియు శాసనసభ్యులు హాజరయ్యారు.
సమావేశ ముఖ్యాంశాలు:
- సునీల్ బన్సల్ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో బీజేపీ వ్యూహాలను చర్చించారు.
- రానున్న ఎన్నికల పై సమీక్ష, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు ఇచ్చారు.
- ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటే కార్యకర్తల ఉత్సాహం, బీజేపీ భవిష్యత్ ప్రణాళికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సమావేశంలో పార్టీ సభ్యులు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ వ్యూహాలను చర్చించారు.