ఎంపీడీవో సమీక్ష సమావేశం

  • తానూర్ ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం
  • అభివృద్ధి పనులపై పంచాయతీ కార్యదర్శుల తో చర్చ
  • వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ఎంపీడీవో సమీక్ష సమావేశం


తానూర్ ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో అబ్దుల్ సమద్ నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగింది. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఎంపీడీవో సమీక్ష సమావేశం

తానూర్, సెప్టెంబర్ 20:

నిర్మల్ జిల్లా తానూర్, మండల కేంద్రమైన తానూర్ ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో అబ్దుల్ సమద్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఈజీయస్ టిఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి పంచాయతీ కార్యదర్శుల నుండి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈజీయస్ ద్వారా చేపట్టిన పనుల వివరాలు, తదితర అంశాలపై చర్చ జరిపారు.

అటు, గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో, ఈజియస్ ఎపిఓ గంగాధర్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీయస్ టిఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు.

Leave a Comment