రేపు వారణాసిలో మోడీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ.2,200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే, 20వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని రేపు విడుదల చేయనున్నారు. 9.7 కోట్ల మంది రైతులకు గాను రూ.20,500 కోట్లు విడుదల కానున్నాయి