బి ఆర్ ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్❓
హైదరాబాద్:సెప్టెంబర్ 03
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత ను సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం యాదృచ్ఛి కంగా కాకుండా, అంతర్గత చర్చలు, వ్యూహాత్మక లెక్కలు వేసుకుని తీసు కున్న చర్యగా తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ తన కుమార్తె వ్యవహారశైలిపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం చెబుతోంది.
ఈ నిర్ణయం ప్రకటించే ముందు కేసీఆర్,తన సన్నిహిత నేతలతో బుధవారం ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. అక్కడ ఆయన కుమార్తె కవిత ప్రవర్తనపై గాఢమైన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కవితకు నేను తక్కువ చేశానా? నిజామాబాద్ ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాను. మద్యం కేసులో ఇబ్బంది పడ్డప్పుడు పెద్ద లాయర్లతో పోరాడించాను. అయినా ఆమె పార్టీకి నష్టం కలిగిం చేలా ఎందుకు నడిచింది?” అని కేసీఆర్ బాధపడ్డారని సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఎమ్మెల్సీ కవిత?
సమావేశంలో కొందరు సీనియర్ నేతలు కవిత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో టచ్లో ఉన్నారని ఆరోపించారు. అంతేకాక, ఆయన సూచనల ప్రకారం వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా కేసీఆర్కు వివరించినట్టు వర్గాల సమాచారం.
ఈ పరిణామాల కారణంగా క్రమశిక్షణ కాపాడడం కోసం కఠిన చర్య తప్పనిసరి అయిందని భావన వ్యక్తమైంది.కవితపై చర్య తీసుకోకపోతే ఇతర నేతలు కూడా తమ అజెండాలతో ముందుకు వచ్చే ప్రమాదం ఉందని కొందరు నేతలు హెచ్చరించారు. పార్టీ లోపలి క్రమశిక్షణ కూలిపోతుందని, ఇది భవిష్యత్తులో బీఆర్ఎస్కు తీవ్రమైన నష్టం కలిగించ వచ్చని వారి అభిప్రాయం. ఈ వాదనలు కేసీఆర్ నిర్ణయానికి దారితీశాయని తెలుస్తోంది.
సస్పెన్షన్ తర్వాత కవిత తదుపరి అడుగులపై కూడా చర్చ జరిగింది. ఆమె కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని, ఒకవేళ చేరితే మంత్రి పదవి కూడా దక్కవచ్చని కొందరు అంచనా వేశారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ, “ఆమెకు మంత్రి పదవి వచ్చినా, అది చివరికి మనకే రాజకీయ లాభమే అని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
కేసీఆర్ తన కుమార్తె విషయంలో కఠినంగా వ్యవహరించడం ద్వారా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. తనకు పార్టీనే కుటుంబమని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేస్తే ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా చూపించారు. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాకుండా, పార్టీ క్రమశిక్షణను బలోపేతం చేసే ప్రయత్నంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.
నేతల అభిప్రాయాలు, ఆధారాలు, భవిష్యత్ ప్రమాదాలను పరిశీలించిన తర్వాతే కేసీఆర్ కవితపై వేటు వేయాలని నిర్ణయిం చుకున్నట్టు తెలుస్తోంది. ఇది బీఆర్ఎస్లో అంతర్గత క్రమశిక్షణను కాపాడటానికి తీసుకున్న కీలక అడుగుగా నిలుస్తోంది