ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా

Alt Name: Legislators Party Defection Case
  • హైకోర్టు దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది.
  • కేసును వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.
  • కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ పిటిషన్ దాఖలు.

 ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో దాఖలైన పిటిషన్ పై గురువారం విచారణ జరిపింది. అడ్వకేట్ జనరల్ గడువు కోరడంతో కేసు విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు.

 M4 న్యూస్:

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ గడువు కోరడంతో, ఈ కేసు విచారణను కోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.

తమ పార్టీలో గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ లోకి ఫిరాయించారని, వీరిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో విచారణ జరిపిన సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో చెప్పేందుకు నాలుగు వారాల గడువు ఇస్తున్నామని, ఆలోగా వివరాలు అందజేయకుంటే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది.

అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన తరువాత తదుపరి విచారణను వాయిదా వేసినట్లు సమాచారం అందింది.

Join WhatsApp

Join Now

Leave a Comment