గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

M4 న్యూస్ (ప్రతినిధి)

ఉట్నూర్: అక్టోబర్ 19

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో చేప పిల్లలను అందజేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. శనివారం ఉట్నూర్ మండలంలోని గోపయ్య చెరువులో చేప పిల్లలను నీటిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సబ్బండ వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, మునుపటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గంగపుత్రులను పట్టించుకోలేదని పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం అందరు వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Comment