భైంసా ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై MLA పవార్ రామరావ్ పటేల్ స్పష్టమైన సూచనలు

MLA Pawar Rao Patel inspecting Bhainsa Area Hospital
  • పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని MLA పవార్ పటేల్ ఆదేశాలు
  • ఆసుపత్రి అభివృద్ధి కోసం పార్కింగ్ సమస్య పరిష్కారంపై హామీ
  • రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరిక

 

భైంసా ఏరియా ఆసుపత్రి తనిఖీ సందర్భంగా MLA పవార్ రామరావ్ పటేల్ వైద్యులు మరియు సిబ్బందిని పేదలకు మెరుగైన వైద్య సేవలందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆసుపత్రి సేవల అభివృద్ధి తన ధ్యేయమని చెప్పిన ఆయన, రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్కింగ్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి MLA పవార్ రామరావ్ పటేల్ ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఆయన ఆసుపత్రి పరిశీలన సందర్భంగా మాట్లాడుతూ, 32 మంది డాక్టర్లు ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

ఆసుపత్రికి చెడ్డ పేరు రాకుండా సిబ్బంది కృషి చేయాలని సూచించిన ఆయన, రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపడం ఆమాన్యమని, అటువంటి పిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలోని విభాగాలను పరిశీలించి అందులో తగిన మార్పులు చేయాలని సిఫార్సు చేశారు.

ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ సమస్య ఉందని గుర్తించిన ఆయన, త్వరలో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్‌తో పాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment